యమ ధర్మరాజుకు పూజలు | - | Sakshi
Sakshi News home page

యమ ధర్మరాజుకు పూజలు

May 27 2025 12:03 AM | Updated on May 27 2025 12:03 AM

యమ ధర

యమ ధర్మరాజుకు పూజలు

ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధం శ్రీయమధర్మరాజుకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయూష్యసూక్తంతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, మంత్రపుష్పం నిర్వహించారు. వివిధ పాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌, ట్రస్టు సభ్యులు సూపరింటెండెంట్‌ కిరణ్‌ ఉన్నారు.

కల్లెడ సహకార సంఘం సీఈవో సస్పెన్షన్‌

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడ సహకార సంఘం సీఈవో శేఖర్‌ను సస్పెండ్‌ను చేస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సోమన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించగా.. కొనుగోలులో తీవ్ర జాప్యం, ని ర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి దీనికి కారణమైన శేఖ ర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సారంగాపూర్‌లో తిరంగా ర్యాలీ

సారంగాపూర్‌: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు జేజేలు పలుకుతూ బీజేపీ నాయకులు మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. భారతమాతకీ జై, జైజవాన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రెంటం జగదీష్‌, నాయకులు కంచర్ల శివ, బాస నాగేందర్‌, బొడ్డుపల్లి శేఖర్‌, బాదినేని శేఖర్‌, బొక్కల రమేశ్‌, అంజి, వంశీ, మల్లేశం, చెరుకు గంగారెడ్డి పాల్గొన్నారు.

రైతులు అధైర్యపడద్దు.. అండగా ఉంటాం

రాయికల్‌: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోర్నపల్లిలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లర్లకు తరలించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల వద్దగాని, రైస్‌మిలర్ల వద్దగానీ సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్‌ గౌడ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొడిపెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సర్వే విధానాన్ని సక్రమంగా నేర్చుకోవాలి

జగిత్యాల: సర్వే విధానాన్ని సర్వేయర్లు సక్రమంగా నేర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో లైసెన్స్‌డ్‌ సర్వే శిక్షణను ప్రారంభించారు. భూభారతి చట్టం కోసం ప్రభుత్వం సర్వేయర్లను నియమించాలని చూస్తోందన్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల కోసం 279 దరఖాస్తులు వచ్చాయని, మొదటి విడత 156 మందికి రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సర్వేను చిత్తశుద్ధితో నేర్చుకుని ఉపాధి పొందాలని, రైతులకు సహాయపడాలన్నారు. ఏడీ వెంకట్‌రెడ్డి, విఠల్‌ పాల్గొన్నారు.

కోటిలింగాల జాతర వేలం

వెల్గటూర్‌: కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయంలో ఏడాది పాటు కొబ్బరికాయలు, పూజాసామగ్రి విక్రయించుకునేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలి పారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఈనెల 28న ఉదయం పది గంటల లోపు ఏదైనా జాతీ య బ్యాంకులో ‘కార్యనిర్వహణ అధికారి, శ్రీకోటేశ్వరస్వామి దేవస్థానం, కోటిలింగాల’ పేరున డీడీ తీసి సీల్డ్‌ టెండర్‌ ఫారంకు జతపరి చి సమర్పించాలని, వివరాలకు ఈవోను సంప్రదించాలని సూచించారు.

యమ ధర్మరాజుకు పూజలు1
1/2

యమ ధర్మరాజుకు పూజలు

యమ ధర్మరాజుకు పూజలు2
2/2

యమ ధర్మరాజుకు పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement