
మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేయండి
మా తాతముత్తాతల కాలం నుంచి ఆలూరు చెరువులో చేపలు పెంచుకుంటూ ఉపాధి పొందుతున్నం. ఇప్పటివరకు మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ ఏర్పాటుకాలేదు. మత్స్యశాఖ అధికా రులను కోరినా పట్టించుకోవడం లేదు. మాకు ప్ర భుత్వం నుంచి లభించే పథకాలు అందడం లే దు. ప్రమాదబీమాకూ దూరమవుతున్నం. గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పేరిట మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయండి.
– రాయికల్ మండలం ఆలూరు మత్స్యకారులు
ఫైనాన్స్ వేధింపుల నుంచి కాపాడండి
మేం తీసుకోని లోన్లు చెల్లించా లంటూ బజాజ్ ఫైనాన్స్, క్రెడ్బీ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికి చెందిన మేం (పిట్టల సురేశ్, చెప్యాల శంకర్, చె ప్యాల శైలజ) రెక్కల కష్టం చేసుకుని జీవిస్తున్నాం. ఏనాడూ రుణం తీసుకోకపోయినా మాకు ఫోన్ అసభ్యపదజాలంతో తిడుతున్నారు. వారి నుంచి కాపాడండి. బజాజ్, క్రెడ్బీ ఫైనాన్స్ బాధితులు

మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేయండి