భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం

May 25 2025 8:06 AM | Updated on May 25 2025 8:06 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం

రాజన్నను దర్శించుకున్న 70 వేల మంది

రూ.65 లక్షల ఆదాయం

రాజన్న సేవలో సినీనటులు

వేములవాడ: రేవతీ నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామికి పంచోపనిషత్‌ ద్వారా అభిషేకం చేశారు. 70వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. కరీంనగర్‌ ఏసీపీ వెంకటస్వామి దంపతులు రాజన్నను దర్శించుకున్నారు. శనిత్రయోదశిని పురస్కరించుకుని అనుబంధ ఆలయం భీమన్నగుడిలో నవగ్రహాలకు పూజలు నిర్వహించారు. రాజన్నను సినీనటులు బాలాదిత్య(చంటి), కౌశిక్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు.

భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం1
1/1

భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement