బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

May 7 2025 12:08 AM | Updated on May 7 2025 12:08 AM

బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

జగిత్యాల: బీఆర్‌ఎస్‌ హయంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో శూన్యమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నా రు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామాలకు గతంలో నెలనెలా నిధులు వచ్చేవని, ట్రాక్టర్లు సమకూర్చి పారిశుధ్య పనులు చేపట్టామని, ఇప్పుడు కనీసం మొక్కలకు నీరు పోసే పరిస్థితి లేదని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు లేక కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి పడుతోందన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అందాల పోటీలు నిర్వహిస్తున్నారని, అబద్దపు హామీలతో గద్దెనెక్కి ఇప్పుడు తప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రతి జిల్లాకు మెడికల్‌ కళాశాల ఇచ్చారని, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చారని గుర్తు చేశారు. నాయకులు మహిపాల్‌రెడ్డి, తుమ్మ గంగాధర్‌, మల్లేశం, దేవేందర్‌నాయక్‌, ప్రవీణ్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌రావు, కమలాకర్‌, రాజన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement