కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లిరూరల్: గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని, ప్రతి ఇంటికి నీరు చేరేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని శానిటేషన్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పల్లెప్రకృతి వనాలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయని, వాటికి నీటిని అందించి కాపాడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేయాలన్నారు. అర్హుల వివరాలు, ఎంపిక చేసిన వారి వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి, మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి, ఎంఈవో చంద్రశేఖర్, ఏవో దీపిక, పశువైద్యాధికారి మనీషా, ఏపీఎం విమోచన, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, పంచాయతీరాజ్ డీఈ రమణ పాల్గొన్నారు.
జిల్లాకు కొత్తగా 2,661 కార్డులు
రేషన్కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు
ఈనెల నుంచి రేషన్ బియ్యం పంపిణీ
రాయికల్: రేషన్కార్డుల్లో పేర్ల నమోదు కోసం ప్రజలు ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ఏళ్ల తరబడిగా రేషన్కార్డులు రాకపోవడంతో కొత్తగా పెళ్లయినవారు.. వారికి పుట్టిన పిల్ల ల పేర్లు నమోదు కాలేదు. వారంతా రేషన్ సరుకులకు దూరమయ్యారు. మరోవైపు అనేక కుటుంబాల్లో సభ్యులు పెరిగారు. వారి పేర్లు కార్డుల్లో ఎక్కించాలని మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు కూడా చాలామంది దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో 2,661 కొత్త కార్డుల్లో పేర్లను నమోదు చేసింది. వారికి రేషన్ బియ్యాన్ని ఈనెల నుంచి విడుదల చేసింది. జిల్లాలో గతంలో 3,07,097 రేషన్కార్డులు ఉండగా.. పెరిగిన కార్డులతో 3,09,758కు చేరాయి. గతంలో 8,98,418 యూనిట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం 9,45,424 యూనిట్లు వచ్చాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందించనుంది.
ఈనెల నుంచి సరుకులు
రేషన్కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చడంతోపాటు ఒక్కో సభ్యునికి ఆరు కిలోల చొప్పున బియ్యం మంజూరు చేస్తోంది. ఈనెల నుంచి రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాలి. డీలర్లు ఇవ్వకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
– చంద్రశేఖర్రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి
ఈవీఎం గోదాం తనిఖీ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంలను కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లత, కోరుట్ల ఆర్డీవో జివాకర్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నాయని, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, వసతులతో కూడిన ల్యాబ్స్, అధునాతనమైన భవనం, సువిశాలమైన గ్రౌండ్ ఉందని, విద్యార్థులు అడ్మిషన్స్కు ముందుకు రావాలన్నారు. రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు. మొదటి విడత ఈనెల 21 వరకు చేసుకోవచ్చని, వెబ్ ఆప్షన్స్ ఈనెల 22 వరకు ఇచ్చుకోవాలని, మొదటి విడత షీట్లను 29న విడుదల చేస్తారని వివరించారు. విద్యార్థులకు సందేహాలుంటే కళాశాలలో సంప్రదించవచ్చని తెలిపారు.

గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు

గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు