
ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు
జగిత్యాలజోన్: న్యాయసేవా అధికార సంస్థ ద్వారా ఖైదీలకు ఉచితంగా న్యాయసేవలు అందించనున్నట్లు సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ అన్నారు. జగిత్యాల స్పెషల్ సబ్ జైలును శనివారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు జైలు జీవితం గుణపాఠంగా మారి, మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా ఉండాలన్నారు. జైలుకు వెళ్లడం ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పి.సతీష్, ఆర్.విజయ్కృష్ణ, సీహెచ్.అనురాధ, జైలర్ మొగిలేష్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.