
నృసింహుడి నవరాత్రోత్సవాలు ప్రారంభం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయలో నవరాత్రోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 11 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఆలయం నుంచి గోదావరి వద్దకు మంగళ వాయిద్యాలతో వెళ్లి బిందే తీర్థం తీసుకొచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పుణ్యవచనం, కలశ స్థాపన, పంచోపనిషత్తులతో అభిషేకం, సహస్ర కలశ స్థాపన నిర్వహించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా భక్తులకు వసతులు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ట్రస్టుబోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, వేదపండితులు తదితరులున్నారు.

నృసింహుడి నవరాత్రోత్సవాలు ప్రారంభం