జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి | US man who received first-ever pig kidney transplant dies at 62 | Sakshi
Sakshi News home page

జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి

May 13 2024 5:13 AM | Updated on May 13 2024 5:13 AM

US man who received first-ever pig kidney transplant dies at 62

బోస్టన్‌: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్‌ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్‌ ‘రిక్‌’ స్లేమాన్‌కు మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. 

అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్‌లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement