
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు
అఫ్జల్గంజ్: కరోనా మళ్లీ విజృంభిస్తోందని వదంతుల నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ తెలిపారు. కరోనా రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైన మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విధి నిర్వహణలో సిబ్బంది, వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కరోనా పట్ల ఆందోళన చెందకుం జాగ్రత్తలు పాటించాలని రాకేష్ సహాయ్ సూచించారు.
ఐసోలేషన్ వార్డు