నార్సింగిలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ లావణ్య | - | Sakshi
Sakshi News home page

నార్సింగిలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ లావణ్య

Jan 30 2024 6:02 AM | Updated on Jan 30 2024 1:56 PM

- - Sakshi

మణికొండ (హైదరాబాద్‌): ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్‌ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. యువతిని అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఈమేరకు నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు.

నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై మురళి ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయని తెలిపారు. దాని విలువ రూ.50 వేల వరకు ఉంటుందని, వాటితో పాటు ఓ సెల్‌ఫోన్‌, రెండు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

నిందితురాలు విచారణలో డ్రగ్స్‌ను తనకు వినీత్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడని తెలిపిందని, అతని కోసం గాలిస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. లావణ్య ఓ యువ సినీ హీరోకు ప్రియురాలు అంటున్నారని, ఈ డ్రగ్స్‌తో సినీ పరిశ్రమకు ఏమైనా లింకులున్నాయా? అని అడిగిన ప్రశ్నకు నిందితురాలి కాల్‌డేటాను పరిశీలిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌ను సరఫరా చేసిన వ్యక్తి దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకొస్తాయని ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement