రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు

Jun 10 2025 3:46 AM | Updated on Jun 10 2025 3:46 AM

రేపటి

రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు

11న ఉచిత మెగా వైద్యశిబిరం

జనగామ: పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డున ఉన్న వేద పంచకర్మ వెల్‌నెస్‌ సెంటర్‌లో ఈనె ల 11 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆ యుర్వేద వైద్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్‌నెస్‌ సెంటర్‌ ఫౌండర్‌ అంజిరెడ్డి సోమవారం తెలిపారు. ‘కౌశలం 2025 ఆయుర్వేదం’ పేరుతో విశ్వ ఆయుర్వేద పరిషత్‌ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జనగామ వేద పంచకర్మ, వెల్‌నెస్‌ సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు ఢిల్లీ, ముంబాయి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. పంచకర్మ విధానాలపై హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌, ఓపీ, ఐపీడీ సందర్శనలు, ఆయుర్వేద చికిత్స విధానాలపై చర్చా గోష్టి, ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా ఆయుర్వేద వైద్య విద్యార్థులు నైపుణ్య చికిత్స విధానం, భవిష్యత్‌ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా 11వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనుమతిలేని విత్తనాలు

విక్రయించొద్దు

విజిలెన్స్‌ డీఎస్పీ మల్లయ్య

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

ఆధ్వర్యంలో దాడులు

ఖిలా వరంగల్‌ : ప్రభుత్వ అనుమతులు లేని పు రుగు మందులు, విత్తనాల విక్రయించినా, నిల్వచేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని విజిలెన్స్‌ డీఎస్పీ బి.మల్లయ్య, ఏఓ రవీందర్‌ హెచ్చరించారు. సోమవారం వరంగల్‌ స్టేషన్‌రోడ్డు, ఫోర్ట్‌రోడ్డులోని సీడ్స్‌, పురుగు మందుల షాపులపై విజిలెన్స్‌, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు విత్తనాల షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెర్టిలైజర్‌ షాపుల్లో రికార్డుల్లో నమోదు చేయని రూ.1,12, 03,718ల విలువైన పురుగు మందులను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఏఓలు మాట్లాడుతూ నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, రికార్డుల ప్రకారం స్టాక్‌ మెంటేన్‌ చేయాలని సూచించారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసేటప్పుడు డీలర్‌ను కచ్చితంగా రశీదు తీసుకో వాలని సూచించారు. ఆలాగే బీటీ–3 విత్తనాలు ఎవరైనా అమ్మితే పోలీసు, వ్యవసాయశాఖ ఆధికా రులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. తనిఖీలో ఇన్‌స్పెక్టర్‌ రాకేష్‌, రెవెన్యూ అధికారి ఏవీ భాస్కర్‌, పీ.రవి తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు
1
1/1

రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement