
అనుమతి లేని మెరీడియన్ స్కూల్ సీజ్
విద్యారణ్యపురి/హన్మకొండ: హనుమకొండ రాంనగర్ ప్రాంతంలోని మెరీడియన్ ప్రైవేట్ పాఠశాలను మంగళవారం ఎంఈఓ నెహ్రూ సీజ్ చేశారు. ఈపాఠశాలను అనుమతి లేకుండా నడిపిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్,టీజీవీపీ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల బాధ్యులు డీఈఓ వాసంతికి పిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు ఎంఈఓ పాఠశాలను సందర్శించి సీజ్ చేశారు. ఎంఈఓ వెంట ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు కన్నం సునీల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, సాంబరాజు, నాగారం ఫణితేజ ఉన్నారు.
8వ సెమిస్టర్
ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ 8వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. 955మందికిగాను 945 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (98.5శాతం) సాధించినట్లు పేర్కొన్నారు.
నాసిరకాన్ని అరికట్టేందుకు
పటిష్ట చర్యలు
సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వానాకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రైతులు నాసిరకం విత్తనాల బారిన పడకుండా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను మంగళవారం పోలీస్ అధికారులతో కలిసి సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన నాసిరకం పురుగు మందులు, విత్తనాలతో పాటు పెద్ద ఎత్తున గడ్డి మందును స్వాధీనం చేసుకోవడంతో పాటు 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా.. వరంగల్ పోలీస్ కమిషనర్కు 77998 48333 నంబర్లో సమాచారం అందించాలని కోరారు.

అనుమతి లేని మెరీడియన్ స్కూల్ సీజ్