
లీకేజీలకు మరమ్మతు చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : వాల్వుల లీకేజీల స్థానంలో కొత్తగా మరమ్మతులు చేయాలని మేయర్ గుండు సుంధారాణి సూచించారు. గురువారం బల్దియా పరిధిలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న వాల్వ్ మరమ్మతు పనులను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీపంలోని 11, 28, 29 డివిజన్ల ఆవాసాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయ వాల్వులు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకు ఎలాంటి ప్రమాదం కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏఈ హబీబ్ మొజామిల్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.