
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఏ నరసింగం, ఖిలా వరంగల్ మండల వ్యవసాయధికారి రవీందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ స్టేషన్ రోడ్డు, ఫోర్ట్ రోడ్డులోని ఎరువులు, విత్తన దుకాణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు గురువారం 25 షాపులను తనిఖీ చేసి రికార్డులు, విత్తనాల విక్రయాలు, అనుమతి, కంపెనీ గుర్తింపు వివరాలు తెలుసుకున్నారు. గాయత్రి, అరుంధతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేశా రు. స్టేషన్రోడ్డులోని ఓ షాపు నిర్వాహకులు కళాష్ సీడ్స్ కంపెనీ వారి విత్తన లైసెన్స్ రెన్యువల్ కాపీని అధికారులకు చూపించలేదు. దీంతో రూ.6,85,980 విలువై న 580 పత్తి, మిర్చి ప్యాకెట్ల విక్రయాలను నిలిపివేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ, విడి విత్తనా లు కొనుగోలు చేసి మోసపోవద్దని, లైసెన్స్ ఉన్న షాపులోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. పంట ముగిసే వరకు విత్తన బిల్లులను భద్రపర్చుకోవాలన్నారు. పంట దిగుబడి రాకుంటే నష్టపరిహారం పొందే అవకాశం ఉందని వివరించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు యాకయ్య, విజయ్, హెడ్కానిస్టేబుల్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఏడీఏ నరసింగం,
ఖిలా వరంగల్ ఏఓ రవీందర్రెడ్డి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు