ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

ఇంటర్

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కమలాపూర్‌ : స్థానిక తెలంగాణ మోడల్‌ స్కూ ల్‌, కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.అనిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీలో 40, బీపీసీలో 40, సీ ఈసీలో 40, ఎంఈసీలో 40 చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. పదో తరగతిలో సాధించిన మెరిట్‌, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఎంపికై న విద్యార్థుల జాబితాను ఈ నెల 26న ప్రకటిస్తామని తెలిపారు. అసక్తి గల విద్యార్థులు ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

ధాన్యం కొనుగోలు

కేంద్రం ప్రారంభం

ఆత్మకూరు : మండలంలోని పెద్దాపూర్‌లో ఆ దివారం పెద్దాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వ రి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించా రు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అంబటి రాజస్వామి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్‌ మాజీ సొసైటీ చైర్మన్‌ ఏరుకొండ రవీందర్‌గౌడ్‌, నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, పరికిరాల వాసు, కక్కెర్ల రాజు, రవి, మాజీ వైస్‌ ఎంపీపీ సాంబయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ స్వామి పాల్గొన్నారు.

వెల్లంపల్లిలో చలివేంద్రం

పరకాల : ముదురుతున్న ఎండల కారణంగా రోడ్లుపైకి చేరుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిదధులు కృషిచేయాలని వెల్లంపల్లి మాజీ సర్పంచ్‌ కృష్ణ కోరారు. మండలంలోని వెల్లంపల్లిలో జైభీమ్‌ యూత్‌ సొసైటీ అధ్యక్షుడు బొట్ల అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. రహదారుల వెంట వెళ్తున్న బాటసారులకు, వాహనాదారులకు వేసవి కాలంలో చలి వేంద్రం ఏర్పాటు చేయడం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ పెండెల మల్ల య్య, కార్యదర్శి ప్రమోద్‌, కాకి శరత్‌, మచ్చ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా శ్రావణ్‌కుమార్‌

శాయంపేట : మండలంలోని గోవిందా పూర్‌ గ్రామానికి చెందిన దాసి శ్రావణ్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌గా నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌ రెడ్డి ఆదివారం ప్రకటించారు. తన నియమకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి, మాజీ జెడ్పీచైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతికి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

యువతి అదృశ్యం

ఆత్మకూరు : మండలంలోని పెద్దాపూర్‌ గ్రా మంలో ఓ యువతి (22) అదృశ్యమైనట్లు యువతి తండ్రి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి రాలేదని ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లెకు చెందిన యువకుడు కర్దురి రాజవర్ధన్‌పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మేమెంతో..

మాకంతా కావాలి

హన్మకొండ: రాష్ట్రంలోనే అధిక జనాభా ఉన్న కులం ముదిరాజ్‌ కులమని, తమకు రిజర్వేషన్‌ ఫలాలు, రాజ్యాధికారంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ముదిరాజ్‌ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్‌ ముదిరాజ్‌ అన్నారు. మేడారంలో చేపట్టిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవ యాత్ర మేడారం నుంచి ములుగు, నల్లబెల్లి, నర్సంపేట మీదుగా 15వ రోజు ఆదివారం వరంగల్‌, హనుమకొండకు చేరుకుంది. ఈమేరకు హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌ల ఆత్మగౌరవం కోసం పాదయాత్ర చేపటినట్లు గుర్తుచేశారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
1
1/3

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
2
2/3

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
3
3/3

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement