
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: వరంగల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. రామన్నపేట, పిన్నావారి వీధి, బట్టల బజార్, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్, పాపయ్యపేట చమన్, రెడ్డి పాలెం, ఆకృతి ఎన్క్లేవ్, నాయుడు పెట్రోల్ పంపు, ఆర్టీఓ కార్యాలయం, గవిచర్ల ఎక్స్ రోడ్డు, సీకేఎం కళాశాల, లక్ష్మి టౌన్షిప్, గ్రీన్ సిటీ, దేశాయిపేట బొడ్రాయి, దేశాయిపేట, ఫిల్టర్బెడ్ క్రాస్ రోడ్డు, లక్ష్మి గార్డెన్, వినాయక వీధి, వాసవి కాలనీ, ఏకశిల కళాశాల, గొర్రెకుంట ఇండస్ట్రీయల్, బూర్గుల గడ్డ, బండి కుమారస్వామి డీటీఆర్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు భగీరథ మహర్షి జయంతి
కాజీపేట అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాల నాయకులు భగీరథ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు.
5నుంచి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇ అండ్ ఐసీటీ సహకారంతో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఈనెల 5నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ తెలిపారు. ఎమెర్జింగ్ రీసెర్చ్ ట్రెండ్స్ ఇన్ ఆల్మిషన్ లెర్నింగ్ అండ్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్పై నిర్వహిస్తున్నట్లు వివరించారు.
తూర్పులో బీజేపీ
డివిజన్ బాధ్యుల నియామకం
వరంగల్: భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు నియోజక వర్గంలో పార్టీ డివిజన్ బాధ్యులను నియమించినట్లు జిల్లా పార్టీ కార్యదర్శి బాకం హరిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశాయిపేట పరిధిలోని 12, 13, 22, 23 డివిజన్లకు విప్ప సుధాకర్, కాశిబుగ్గ పరిధిలోని 18, 19, 20, 21వ డివిజన్లకు అపురూప రజనీష్ నేత, మట్టెవాడ పరిధిలోని 24, 25, 26, 28వ డివిజన్లకు సీతా నాగరాజు, శివనగర్ పరిధిలోని 27, 34, 35, 36వ డివిజన్లకు ఎండీ.రఫీ, కరీమాబాద్ పరిధిలోని 32, 33, 39, 40వ డివిజన్లకు బొరిగం నాగరాజు, ఖిలా వరంగల్ పరిధిలోని 37, 38, 41, 42వ డివిజన్లకు తాళ్లపెల్లి అర్జున్గౌడ్ నేతృత్వంలోని కార్యవర్గాలకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.
ఎగ్జిబిషన్ ప్రారంభం
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించేలా 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో ఈవీ.శ్రీనివాస్ రావు, చంద్రపాల్, బట్టి శ్రీనివాస్, సారంగపాణి, సత్యనారాయణ, మేనేజర్లు శ్రీకాంత్, ఫిరోజ్ పాల్గొన్నారు.
గంధోత్సవానికి తరలిరావాలి
వరంగల్: భద్రకాళి బ్రహోత్సవాల్లో భాగంగా 5వ తేదీ సోమవారం జరగనున్న గంధోత్సవానికి పద్మశాలి కుల బాంధవులు పెద్దఎత్తున తరలి రావాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్ పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్లోని జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంధోత్సవ మహోత్సవానికి పద్మశాలి కులస్తులు కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరారు. సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నరేందర్, కుసుమ సతీష్, గోరంట్ల రాజు, బేతి అశోక్, చిప్ప వెంకటేశ్వర్లు, డీఎస్.మూర్తి, బైరి శ్యామ్, యాదగిరి, మురళీకృష్ణ, కామేశ్వర్, అశోక్, కుమారస్వామి, రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
ఖిలా వరంగల్ / రామన్నపేట: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రమశక్తి అవార్డు గ్రహీత, తూర్పుకోటకు చెందిన బిల్లా శ్రీకాంత్ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శనివారం సన్మానించారు. కార్యక్రమంలో బస్వరాజు శిరీష్, శ్రీమాన్, తత్తురి లక్ష్మణ్, దామెర సర్వేశం, జన్ను రవి, గోరంటల రాజు, కరాటే ప్రభాకర్, చాగంటి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ చంద్రమౌళి, శ్రీధర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు