
సంక్షోభంలోకి యూనివర్సిటీలు
● రాష్ట్ర ఉన్నత విద్యామండలి
మాజీ చైర్మన్ పాపిరెడ్డి
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన యూనివర్సిటీలు రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. రెగ్యులరైజేషన్ చేయాలని కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనా భవవనం ఎదుట కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శంచి సంఘీభావం తెలిపారు. ఏళ్లుగా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేసినప్పటికీ గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ బాధ్యులు కరుణాకర్రావు, సంకినేని వెంకట్, రవీందర్, సాడురాజేశ్, శ్రీధర్కుమార్ లోథ్, జూల సత్య, అరూరి సూర్యం, సూర్యనారాయణ, చంద్రశేఖర్, నాగయ్య, శ్రీదేవి, శ్రీలత, కవిత, సరిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా.. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.