
విద్యుత్ ఏడీఈల సీనియారిటీ రెడీ..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు యాజమాన్యం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితా ఎట్టకేలకు రూపొందించింది. ఇప్పటికే ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులతో విస్తృత సంప్రదింపులు జరిపి, చర్చించి రూపొందించిన జాబితాపై మరోసారి అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. తాత్కాలిక జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఈ తాత్కాలిక జాబితా ఈ నెల 25వ తేదీన రాత్రి విడుదల చేసింది. ఈ లెక్కన ఏప్రిల్ 8వ తేదీలోపు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అనంతరం పూర్తి స్థాయిలో తుది జాబితా రూపొందిస్తారు.
ఇప్పటికే 10 మంది వరకు ఏఈల రిటైర్డ్..
టీజీ ఎన్పీడీసీఎల్లో పదోన్నతుల కోసం ఏడీఈలు, ఏఈలు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ జాప్యమవుతున్న క్రమంలో ఏఈలు ఒక్కొక్కరుగా రిటైర్డ్ అవుతున్నారు. ఇప్పటికే 10 మంది వరకు రిటైర్డ్ అయ్యారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఆలస్యమైతే మరికొంత మందికి అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ఏడీఈలకు డివిజనల్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పిస్తే ఖాళీలు పెరిగే అవకాశముంది. దీంతో పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఆశావహులైన ఏఈలకు ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు లభించే అవకాశముంది.
70 మందితో ఏడీఈల
తాత్కాలిక సీనియారిటీ..
ఏడీఈల తాత్కాలిక సీనియారిటీ జాబి తా 70 మందితో రూపొందించారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో ఇప్పట్లో అందరికి పదోన్నతి లభించే అవకాశం లేదు. సీని యారిటీ ప్రకారం డీఈ పోస్టులు ఖాళీ అవుతున్న కొద్దీ జాబితాలో పేర్కొన్న సీనియారిటీ ప్రకారం క్రమంగా పదోన్నతి లభించనుంది. ఏడీఈల సీనియారిటీ జాబితాతో తమకు కూడా పదోన్నతి కల్పిస్తారని ఏఈలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ నాయకులు పట్టుదలకు పోకుండా పదోన్నతి ప్రక్రియ సజావుగా, త్వరగా ముగిసేలా సహకరించాలని ఆశావహులు కోరుతున్నారు.
తాత్కాలిక జాబితాలో 70 మందికి చోటు
ఇందులో ఇప్పటికే ముగ్గురికి పదోన్నతి
ప్రమోషన్లకు తొలుగుతున్న అడ్డంకులు
ఏడీఈలకు డీఈలుగా పదోన్నతులు ఇస్తే.. ఏఈలకు లైన్ క్లియర్