పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు, వంగర కవిత, దుర్గా వెంకట మహేష్ దంపతులు, కుటుంబ సభ్యులు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్ధాన ఈ.వో. గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.


