అర్జీలపై నిర్లక్ష్యంగా ఉంటే షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై నిర్లక్ష్యంగా ఉంటే షోకాజ్‌ నోటీసులు

Jul 22 2025 7:53 AM | Updated on Jul 22 2025 8:07 AM

అర్జీలపై నిర్లక్ష్యంగా ఉంటే షోకాజ్‌ నోటీసులు

అర్జీలపై నిర్లక్ష్యంగా ఉంటే షోకాజ్‌ నోటీసులు

గుంటూరు వెస్ట్‌: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని అర్జీలు వివిద శాఖలు సమన్వయంతో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని ఉపేక్షించనని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి సమాధానాలు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలన్నారు. అధికారులు అవసరమైన మేరకు లీగల్‌ టీమ్‌ సహాయం తీసుకోవాలన్నారు. మండల, డివిజనల్‌, మున్సిపల్‌ స్థాయి అధికారులకు ప్రతి వారం ప్రజలు అర్జీలు ఇవ్వొచ్చన్నారు. 368 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ, డీఆర్వో ఖాజావలి, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.

జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement