
ఈ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఆక్రమ కేసులు బనాయించడంతోపాటు అనేక కేసుల్లో థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ క్రూరంగా వ్యవహరిస్తోంది. తెనాలిలో అత్యంత దారుణంగా చట్టాలకు వ్యతిరేకంగా పోలీసులు నడిరోడ్డు మీద నిందితులను కూర్చోబెట్టి థర్డ్డిగ్రీ ప్రయోగించారంటే అది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమే. హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగే మానవ హక్కుల సంఘానికి సంబంధించి సుమోటోగా కేసు రిజిస్ట్రేషన్ చేసి తక్షణమే దాడికి పాల్పడ్డ సీఐలను, వారికి సహకరించిన వారిని సస్పెండ్ చేయాలి. గురజాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడో హైదరాబాదులో పనిచేసుకుంటూ ఒక ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన హరికృష్ణను తెలుగుదేశం పార్టీ నాయకులకు కారులో ఎత్తుకొని వెళ్లి చిత్రహింసలకు గురిచేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేని విధంగా కొట్టినటువంటి సీఐ భాస్కర్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ మీద ఆక్రమ కేసులు బనాయిస్తూ పోతున్నారు . ఇప్పటి వరకు 8 కేసులు కేసులు నమోదు చేశారు. పీడీ యాక్ట్ పెడితే దానికి సంబంధించి హైకోర్టుకు వెళితే పీడీ యాక్ట్ను కొట్టి వేసింది. అయినా మళ్లీ దొంగతనం కేసు పెట్టి లోపల పెట్టడం అన్యాయం.
––పోలూరి వెంకటరెడ్డి,
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు