దురాచారాల నిర్మూలనలో పరిషత్‌ల కృషి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

దురాచారాల నిర్మూలనలో పరిషత్‌ల కృషి భేష్‌

May 28 2025 11:49 AM | Updated on May 28 2025 11:49 AM

దురాచ

దురాచారాల నిర్మూలనలో పరిషత్‌ల కృషి భేష్‌

నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్‌లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్‌ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్‌ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్‌లను కళాపరిషత్‌ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్‌ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు...

హైదరాబాద్‌ గోవాడ క్రియేషన్స్‌ వారి జ్యోతిరాజ్‌ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్‌ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి.

నేటి ప్రదర్శనలు...

తాడేపల్లి అరవింద ఆర్ట్స్‌ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్‌ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్‌ ‘కిడ్నాప్‌’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.

కొనసాగుతున్న

జాతీయస్థాయి నాటిక పోటీలు

దురాచారాల నిర్మూలనలో పరిషత్‌ల కృషి భేష్‌1
1/1

దురాచారాల నిర్మూలనలో పరిషత్‌ల కృషి భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement