వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’

May 26 2025 1:28 AM | Updated on May 26 2025 1:28 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’

వేమూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్‌ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. నియోజకవర్గంలో కేవీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు.

ట్రాక్టర్‌ కింద పడి వ్యక్తి మృతి

వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్‌తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్‌ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్‌ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్‌ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్‌పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్‌ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement