నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన

May 26 2025 1:28 AM | Updated on May 26 2025 1:28 AM

నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన

నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన

నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్‌ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్‌లైన్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్‌ 5న నాగార్జునసాగర్‌, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్‌ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్‌ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్‌కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్‌ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం

కొనసాగుతున్న శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement