
పీజీఆర్ఎస్కు విధిగా హాజరుకావాలి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలు వినాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలిపారు. కొందరు అఽధికారులు ఈ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పీజీఆర్ఎస్కు రావడం కుదరని అధికారులు నిర్దిష్టమైన కారణాన్ని చూపాలని ఆమె చెప్పారు. ప్రజలు కూడా తమ అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారుల్ని ఆమె ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం వచ్చిన 197 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
అధికారులకుకలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశం
నా పేరుతో అక్రమ అకౌంట్లు
నేను 2004 నుంచి 2016 వరకు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేశా. కొంత కాలానికి యాజమాన్యం నాతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి చెక్కులపై సంతకాలు చేయించుకుంది. ఆ తర్వాత యాక్సిస్, కరూర్ వైశ్యా బ్యాంకుల్లో రూ.4 కోట్లు టర్నోవర్తో పాటు నా పేరుతో రూ.2 కోట్లు రుణాన్ని తీసుకుంది. నాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదు. నన్ను మోసం చేసి నా పేరుతో రుణాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి.
–టి.ఎస్.ఎస్.ఏ.వి.ఎస్.ఆర్. స్వామి నాయుడు, గుంటూరు
తోళ్ల వ్యాపారంతో నరకప్రాయం
పాత గుంటూరులోని జామియానగర్ గొట్టాల రోడ్డులో కొందరు వ్యక్తులు పొట్టేళ్ల చర్మం ప్రాసెసింగ్ చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో చుట్టుపక్కల నివసించే వారికి నరకప్రాయంగా ఉంది. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయండి.
–బి.ప్రసాద్, షేక్ రియాజ్, షేక్ వలి, గుంటూరు

పీజీఆర్ఎస్కు విధిగా హాజరుకావాలి

పీజీఆర్ఎస్కు విధిగా హాజరుకావాలి