పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యటన | - | Sakshi
Sakshi News home page

పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యటన

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యటన

పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యటన

పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యటన నేడు జిల్లా స్థాయి కెరీర్‌ ఎక్స్‌పో మనస్తాపంతో వ్యక్తి మృతి పెదవేగి: భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి బలన్మరణానికి పాల్పడి మృతి చెందాడు. పెదవేగి ఎస్సై హరి గోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం వంగూరుకు చెందిన సత్యవరపు శ్రీను(50) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 17న ఉదయం శ్రీను భార్య అస్వస్థతతో మరణించగా.. మనస్తాపానికి గురైన శ్రీను అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను శుక్రవారం మృతిచెందాడు.

పోలవరం రూరల్‌: పోలవరంలో రెండోరోజు సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు పర్యటించారు. ప్రాజెక్టులోని డయాప్రమ్‌ వాల్‌ ప్రాంతంలో వినియోగిస్తున్న కంకరను శాస్త్రవేత్తలు రవి అగర్వాల్‌, లలిత్‌ కుమార్‌ సోలంకి శుక్రవారం పరిశీలించారు. కంకరను సిమెంట్‌, ఇసుకతో కలిపిన తరువాత నాణ్యత ఎలా ఉందో పరిశీలించారు. ప్రాజెక్టులోని ల్యాబ్‌లో కూడా పరీక్షించారు. కొన్ని నమూనాలను తమ వెంట తీసుకెళ్లి కేంద్ర పరిశోధనాస్థానంలో పరీక్షించేందుకు సేకరించారు. వీరి వెంట జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్‌, డీఈఈలు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో స్వీయ అవగాహన, ఆసక్తులు–నైపుణ్యాల గుర్తింపు, భవిష్యత్‌ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం జిల్లా స్థాయి కెరీర్‌ ఎక్స్‌పోను ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ కే.పంకజ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా ఈ నెల 15 నుంచి 18 వరకూ జిల్లాలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో పాఠశాల స్థాయి కెరీర్‌ ఫెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించామని, నాలుగు రోజుల పాటు విభిన్న కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. శనివారం ఏలూరులోని డీసీఎంఎస్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ హాలులో ఈ కెరీర్‌ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు. ఎక్స్‌పోలో ఆరోగ్య, ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఐటీ, బ్యాంకింగ్‌, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, రక్షణ సేవలు, మీడియా, పర్యాటకం వంటి విభిన్న రంగాలకు సంబంధించిన 25–30 కెరీర్‌ స్టాళ్ళు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement