బాల్య వివాహాలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను నియంత్రించాలి

Nov 8 2025 7:42 AM | Updated on Nov 8 2025 7:42 AM

బాల్య

బాల్య వివాహాలను నియంత్రించాలి

బాల్య వివాహాలను నియంత్రించాలి సుప్రీంకోర్టు సీజేపై దాడి దారుణం సమైక్యతా నినాదం వందేమాతరం దేశభక్తిని మేల్కొలిపే శక్తి

నూజివీడు: డివిజన్‌లో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నియంత్రణపై డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మా ట్లాడుతూ డివిజన్‌లోని ఆరు మండలాల్లో క లిపి 23 బాల్య వివాహాలు జరిగినట్టు రిపోర్టు అయ్యాయని, వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం మాత్రం టీనేజీ గర్భిణులు 302 మంది నమోదయ్యారన్నారు. ఇది అందరి వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు. ఎంఎస్‌కేలు గ్రామస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఐసీడీఎస్‌ పీడీ పి.శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి, సీడీపీఓ పి.విజయకుమారి, డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి చేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద దళిత సేన ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్‌ మాట్లాడుతూ గవాయ్‌పై దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని, దాడి జరిగి రోజులు గడుస్తున్నా సుమోటోగా కేసును సుప్రీంకోర్టు గాని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ గాని ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా సుమోటో కేసు నమోదు చేయాలని డి మాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో ఇచ్చారు. దళిత సేన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చీలి మోహనరావు, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దిరుసు పాము కృష్ణమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డి.పుష్ప, కృష్ణా జిల్లా దళిత సేన అధ్యక్షుడు భూసే అనిల్‌ కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే వందేమాతరం గీత లక్ష్యమని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ అన్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది, సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహనీయులు, వీరులు, జాతీయ నేతల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ధీరత్వానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందన్నారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, డీటీసీ డీఎస్పీ ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, మహిళా స్టేషన్‌ సీఐ ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): వందేమాతరం నినాదం ప్రజల్లో దేశభక్తిని మేల్కొలిపే శక్తి అని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అన్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం ని ర్వహించారు. జేసీ మాట్లాడుతూ వందేమాత రం స్వాతంత్య్ర స్ఫూర్తికి మూలం అన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నియంత్రించాలి 1
1/2

బాల్య వివాహాలను నియంత్రించాలి

బాల్య వివాహాలను నియంత్రించాలి 2
2/2

బాల్య వివాహాలను నియంత్రించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement