ఇంటింటికీ సేవలు దూరం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ సేవలు దూరం

May 30 2025 1:05 AM | Updated on May 30 2025 1:05 AM

ఇంటిం

ఇంటింటికీ సేవలు దూరం

ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల్లో ఎస్జీటీల బదిలీలపై స్పష్టత రాలేదు. వీరికి ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. 8లో u
గడపగడపకూ సేవలు దూరమయ్యాయి.. రేషన్‌ కోసం బారులు తీరే క్యూలైన్లు.. పెన్షన్‌ కోసం అప్పుడప్పుడూ సచివాలయాలకు వెళ్లడం.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం మండల, జిల్లా కేంద్రాలకు పరుగులు.. పంట విక్రయాలకు మిల్లుల వద్ద పడిగాపులు.. ఇది ఏడాది కూటమి పాలనలో జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికే పెన్షన్‌, రేషన్‌, ఫ్యామిలీ డాక్టర్‌ పేరిట వైద్యసేవలు, రైతుభరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందగా ప్రస్తుతం ఇవన్నీ మృగ్యంగా మారాయి. అలాగే మరిన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మళ్లీ ప్రజలను కూటమి ప్రభుత్వం రోడ్డెక్కిస్తోంది.

శురకవారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఏడాది ప్రభుత్వ పాలనతో ప్రజల స్థితిగతులు తలకిందులయ్యా యి. ప్రతిదానికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, అర్జీలు ఇవ్వడం, పథకం అమలు చేసినప్పుడు అర్హత ఉంటే అమలు చేస్తామని సమాధానం రావడం, ప్రతి పౌర సేవ కోసం నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పాలకులు సృష్టించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పౌరసేవలు మొదలు సంక్షేమ పథకాల వరకు అన్నీ ఇంటి ముంగిటకే తీసుకువచ్చారు. ప్రధానంగా ప్రతి 50 కు టుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి సేవలందించారు. ఇలా కోవిడ్‌, గోదావరి వరదల వంటి సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన సేవలు అందించారు. జిల్లాలో 10,800 మంది వలంటీర్లు పనిచేశారు. వలంటీర్లకు జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు కొనసాగిస్తాం అంటూ కూటమి నాయకులంతా గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసి జిల్లాలో 10,800 మంది పొట్టకొట్టారు.

రూ.3,897 కోట్ల పెన్షన్‌ పంపిణీ

గత ప్రభుత్వం పెన్షన్‌ పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి వలంటీర్‌ పింఛన్‌ అందించేవారు. మధ్యాహ్నం 12 గంటలలోపు 95 శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. ఎవరైనా తీవ్ర రుగ్మతలతో దూర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఉంటే వారి వద్దకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్‌లు అందించి మన్ననలు పొందారు. జిల్లాలో 2,81,470 పెన్షన్‌దారులకు ప్రతినెలా సగటున రూ.81.75 కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తంగా రూ.3,897.85 కోట్ల నగదు పంపిణీ చేశారు. అలాగే రెండేళ్ల పాటు గోదావరి వరదల్లోనూ సుమారు 1,000 మంది వరకు వలంటీర్లు పునరావాస సేవలు, తక్షణ నష్టపరిహార పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయడంతో సమస్యలు మొదటికి వచ్చాయి.

పారదర్శకంగా ఇంటికే రేషన్‌

రేషన్‌ కోసం పడిగాపులు కాయడం, ప్రతినెలా 1 నుంచి 10వ తేదీ వరకూ రేషన్‌ షాపుల వవద్ద క్యూలైన్లకు స్వస్థి పలికేలా మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌ (ఎండీయూ) పేరుతో రేషన్‌ వాహనాలను గత ప్రభుత్వం తీసుకువచ్చింది. జిల్లాలో 395 వాహనాలను మంజూరు చేసి సబ్సిడీపై వాహనాలను సమకూర్చి ప్రతినెలా ఆపరేటర్‌కు రూ.21 వేలు జీతం ఇచ్చేలా ఏర్పాటు చేసి 395 మందికి ఉపాధి కల్పించారు. 1,123 రేషన్‌ షాపులకు 395 వాహనాలను అనుసంధానం చేసి జిల్లాలోని 6,31,044 రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యాన్ని, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమపిండి, ఆయిల్‌ ప్యాకెట్లను కార్డుదారుల ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వ్యవస్థను కూడా రద్దు చేయడంతో ఆపరేటర్లు పోరుబాట పట్టారు.

న్యూస్‌రీల్‌

వ్యవస్థల విధ్వంసం.. ప్రజలకు శాపం

పేదింటి తలుపు తట్టిన జగన్‌ ప్రభుత్వం

ఇంటి వద్దకే పథకాలు, రేషన్‌ సరుకులు, వైద్య సేవలు

ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

వలంటీర్‌ వ్యవస్థ తొలగింపు

పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్‌’

రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ వ్యవస్థ రద్దు

ఇంటింటికీ సేవలు దూరం 1
1/3

ఇంటింటికీ సేవలు దూరం

ఇంటింటికీ సేవలు దూరం 2
2/3

ఇంటింటికీ సేవలు దూరం

ఇంటింటికీ సేవలు దూరం 3
3/3

ఇంటింటికీ సేవలు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement