సినిమా థియేటర్లలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లలో తనిఖీలు

May 30 2025 1:05 AM | Updated on May 30 2025 1:05 AM

సినిమ

సినిమా థియేటర్లలో తనిఖీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ల నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల ఏర్పాటు, క్యాంటిన్లలో ధరలు తదితర అంశాలు, రికార్డులను పరిశీలించారు.

ఏలూరులో అంబికా థియేటర్‌, సాయి బాలా జీ థియేటర్‌, సత్యనారాయణ థియేటర్‌లలో తహ సీల్దార్‌ జీవీ శేషగిరి తనిఖీ చేశారు. ఓ థియేటర్‌లోని క్యాంటిన్‌లో కూల్‌ డ్రింకులు, వాటర్‌ బాటిల్స్‌ అధి క ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో థియేటర్లను అక్కడి తహసీల్దార్‌ తనిఖీ చేశారు. కై కలూరులో విజయలక్ష్మి, వెంకటరమణ థియేటర్లను తహసీల్దార్‌ ఎండీ ఇబ్రహీం, భీమ డోలులో శ్రీనివాసా ఽథియేటర్‌ను తహసీల్దార్‌ ర మాదేవి తనిఖీ చేశారు.

బంద్‌ పిలుపు కారణంగానే..

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై థియేటర్ల నిర్వహణపై పలు నిర్ణ యాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా థియేటర్లలో ప్రదర్శనలు అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాకు వచ్చే లాభాల ప్రాతిపదికన ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అలా లాభాల్లో వాటా ఇవ్వని పరిస్థితి వస్తే థియేటర్లను జూన్‌ 1 నుంచి మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త సినిమా రిలీజైన వెంటనే ఓటీటీల్లో రిలీజ్‌ చేయకుండా చూడాలని నిర్మాతల ము ందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా నిర్ణయాల వెనుక కుట్రకోణం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో థియేటర్ల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పలువురు ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు. ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ ఎగ్జిబిటర్‌ స్పష్టం చేశారు.

జిల్లాలో 42 థియేటర్లు

జిల్లాలో గతంలో 90 థియేటర్లు ఉండగా ప్రస్తుతం 42 థియేటర్లు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 15, చింతలపూడిలో 9, నూజివీడులో 5, ఉంగుటూరులో 6, కై కలూరులో 4, పోలవరంలో 3 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు.

బంద్‌ పిలుపే తనిఖీలకు కారణమంటున్న ఎగ్జిబిటర్లు

ఏలూరు జిల్లాలో 42 థియేటర్లు

నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికారులు

బంద్‌ విరమించారు

సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి. దీంతో ఎగ్జిబిటర్లు బంద్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దలు మధ్యవర్తిత్వంతో తెలుగు చిత్రసీమ ప్రయోజనాల కోసం వారు బంద్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

– అంబికా కృష్ణ, సినీ నిర్మాత, ఏలూరు

నిర్వహణ సంతృప్తికరం

ఏలూరులో థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సంతృప్తికరంగా ఉంది. కొన్ని థియేటర్లలోని క్యాంటిన్లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్‌లు విక్రయంచడాన్ని గుర్తించాం. దీనిపై నిర్వాహకులను హెచ్చరించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

– జీవీ శేషగిరి, ఏలూరు తహసీల్దార్‌

సినిమా థియేటర్లలో తనిఖీలు 1
1/2

సినిమా థియేటర్లలో తనిఖీలు

సినిమా థియేటర్లలో తనిఖీలు 2
2/2

సినిమా థియేటర్లలో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement