కొల్లేరులో అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో అక్రమ తవ్వకాలు

May 30 2025 1:05 AM | Updated on May 30 2025 1:05 AM

కొల్లేరులో అక్రమ తవ్వకాలు

కొల్లేరులో అక్రమ తవ్వకాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్ట్‌ అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువుల తవ్వకానికి అక్రమార్కులు మరోసారి తెర తీశారు. గురువారం ఏలూరు రూరల్‌ మండలం మానూరు శివారు హరిపురంలో చెరువు గట్లు ఏర్పాటుచేశారు. కొల్లేరులో చెరువులు తవ్వటానికి అనుమతి లేదని తెలిసినా పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఫారెస్ట్‌ అధికారులు ఇక్కడకు చేరుకుని గట్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. అయితే గట్లు ఎవరూ వేశారన్నది తెలియదన్నారు. కొల్లేరులో జీఓ 120కు వ్యతిరేకంగా చెరువులు తవ్వితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గిట్టుబాటు ధర కల్పించాలి

దెందులూరు: నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం రామారావుగూడెంలో నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు. నిమ్మ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిమ్మకాయల సీజన్‌లో ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.

31న ‘20 సూత్రాల’పై సమీక్ష

ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం 20 సూత్రాల కార్యక్రమం అమలుపై ఈ కార్యక్రమం చైర్మన్‌ లంకా దినకర్‌ అధికారులతో సమీక్షిస్తారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, మ ధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని గురువారం కలెక్టరేట్‌ వర్గాలు ప్రకటనలో తెలిపాయి.

ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్‌

నూజివీడు: నూజివీడు ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఏడాదిగా ఫ్రీజర్‌ పనిచేయడం లేదు. దీంతో అద్దె ఫ్రీజర్‌ను ఏర్పాటుచేశారు. అయితే అద్దె రోజుకు రూ.5 వేలను మృతదేహానికి సంబంధించిన వారే చెల్లించాల్సి వస్తుంది. అసలే కుటుంబసభ్యులు బాధలో ఉండగా వారితో అద్దె కట్టించడం దారుణమని, పాడైపోయిన ఫ్రీజర్‌కు మరమ్మతులు చేయించడం లేదా కొత్త ఫ్రీజర్‌ను ఏర్పాటుచేయడం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

రిటర్నులు దాఖలు చేయాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలని ఆ దాయ పన్నుశాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రతాప్‌ సింగ్‌ భూక్యా సూచించారు. గురువారం స్థాని క డీసీఎంఎస్‌ హాల్‌లో జిల్లా కో–ఆపరేటివ్‌ సొసైటీలు రిటర్నుల దాఖలుపై జిల్లా కో–ఆపరేటివ్‌ కార్యదర్శులు, పర్సన్‌ ఇన్చార్జిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ లాగిన్‌ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో సొసైటీలన్నీ ఆడిటర్‌ను సంప్రదిచి రిటర్నులు దాఖలు చేయాలని సూచించారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్‌ అబ్దుల్‌ ఖయాం, డివిజనల్‌ కో– ఆపరేటివ్‌ అధికారి పి.త్రినాథ్‌, ఆడి టర్‌ ఆర్‌.రాధాకృష్ణ పాల్గొన్నారు.

వెదురు సాగుకు సన్నాహాలు

బుట్టాయగూడెం: డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్టు మా నవ వనరుల అభివృద్ధి పథకం జిల్లా అసిస్టెంట్‌ మేనేజర్‌ ఈ.వేణుగోపాల్‌ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల వీఓఏలకు వెదురు సాగుపై శిక్షణ ఇచ్చా రు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలను వెదురు సాగుకు పైలెట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. 500 గ్రామ సంఘాల సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరూ 35 సెంట్లలో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

కుటుంబం ఆత్మహత్యాయత్నం

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో ఓ కు టుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన మంగిన సత్య దుర్గ చంద్రరరావు (చంద్రం), భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్‌, కు మార్తె కోమలి గురువారం కూల్‌డ్రింక్‌లో కలు పు మందు కలిపి తాగారు. చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వీరిని మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కారణంగా తె లుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement