
సందేశాత్మకంగా నాటికలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు రెండోరోజు ఆదివారం కొనసాగాయి. అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అంబికా కుటుంబ సేవలు అభినందనీయమన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వేల్చేరు నారాయణరావుకు 11వ తానా–గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, వీఎల్ఎంఆర్ వెంకటరావు అందించి సత్కరించారు. నాటిక పోటీల్లో భాగంగా గోవాడ క్రియేషన్ (హైదరాబాద్) వారి అమ్మ చెక్కిన బొమ్మ, కృష్ణా ఆర్ట్స్–కల్చరల్ అసోసియేషన్ (గుడివాడ) వారి ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికలు అలరించాయి. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ మంత్రి మరడాని రంగారావు, సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కేవీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నాటికలో ఓ సన్నివేశం

సందేశాత్మకంగా నాటికలు