
టెన్నికాయిట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక
దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళల జట్టుకు గెడల హేమమాధురి, రాపాక సంస్కృతి, రాపాక సౌరిక, ఎస్కే లతిఫా, మిరియాల ప్రియదర్శిణి ఎంపికై నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల జట్టుకు బోయిన చంటిబాబు, గంగుల చంద్ర మహేష్, రాపాక నవీన్, మద్దాల అజయ్, గారపాటి బాబీలను ఎంపిక చేశామన్నారు. వీరు మండపేటలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న జట్లకు రెండు రోజుల పాటు స్థానిక జెడ్పీ హైస్కూల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. క్రీడాకారులకు టెన్నీకాయిట్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గన్నమని హరికృష్ణ, వైస్ చైర్మన్ ఉప్పులూరి రాంబాబు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, దాపర్తి వెంకటేశ్వరరావు, 20 మంది పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.