
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.