మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోరుతూ టీచర్ల నిరశన | - | Sakshi
Sakshi News home page

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోరుతూ టీచర్ల నిరశన

Jun 10 2025 7:26 AM | Updated on Jun 10 2025 7:26 AM

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోరుతూ టీచర్ల నిరశన

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోరుతూ టీచర్ల నిరశన

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్‌ (ఎస్‌జీటీ) టీచర్లకు మాన్యవల్‌ విధానంలో కౌన్సెలింగ్‌పై స్పష్టత లేకపోవడంతో సోమవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద ఽనిరాహార దీక్ష చేపట్టారు. ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌ కౌన్సెలింగ్‌కు ఉపాధ్యాయ ఐక్యసంఘాలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కే కట్టుబడి ఉండటంతో వెబ్‌ ఆప్షన్‌లకు లింక్‌ విడుదల చేసినప్పటికీ ఆప్షన్లు ఇవ్వడం లేదు. దశలవారీ పోరాటంలో భాగంగా ఐక్యవేదిక పిలుపు మేరకు నిరహార దీక్ష చేపట్టారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. పీడీఎఫ్‌ ఎంఎల్‌సీ బొర్రా గోపిమూర్తి హాజరై సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. జీవో నంబర్‌ 22లో అనేక లోపాలున్నాయని, దాన్ని మార్పు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement