అమరజీవికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరజీవికి ఘన నివాళి

Mar 17 2025 12:12 AM | Updated on Mar 17 2025 12:12 AM

అమరజీవికి ఘన నివాళి

అమరజీవికి ఘన నివాళి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు జీవితాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సీతారామ్మూర్తి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష్య సాధనకు శ్రీరాములు వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, కలెక్టరేట్‌, ఇతర కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement