పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ

May 30 2025 12:09 AM | Updated on May 30 2025 12:09 AM

పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ

పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ

రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్‌ అసిస్టెంట్లకు గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్‌ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్‌కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్‌, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్‌ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్‌ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది.

బదిలీలకు 8,836 మంది

ఉపాధ్యాయుల దరఖాస్తు

రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్‌ హెచ్‌ఎంలు 215, ఎల్‌పీ హిందీ 41, ఎల్‌పీ సంస్కృతం 3, ఎల్‌పీ తెలుగు 93, ఎల్‌పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్‌ఏ తెలుగు 524 మంది, ఎస్‌ఏ ఇంగ్లిష్‌ 729, ఎస్‌ఏ హిందీ 396, ఎస్‌ఏ సంస్కృతం 9, ఎస్‌ఏ ఉర్దూ 2, ఎస్‌ఏ బయలాజికల్‌ సైన్స్‌ 479, ఎస్‌ఏ గణితం 873, ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌ 615, ఎస్‌ఏ సోషల్‌ స్టడీస్‌ 471, ఎస్‌ఏ ఫిజికల్‌ డైరెక్టర్‌ 260, ఎస్‌ఏ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 10, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 3,826 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement