మార్గదర్శకాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలు పాటించాలి

Mar 15 2025 12:35 AM | Updated on Mar 15 2025 12:34 AM

రాజమహేంద్రవరం రూరల్‌: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ‘ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి’ అనే నినాదంతో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నగరపాలక సంస్థ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యాన పారిశుధ్యంతో పాటు సింగిల్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరు కావాలని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలు, మతపరమైన సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యాన స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement