
కుటుంబ కథా చిత్రం ‘పౌరుషం’
● చిత్ర హీరో, దర్శకుడు షెరాజ్ మెహ్ద
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అన్ని వర్గాల వారు మెచ్చేలా కుటుంబ కథా చిత్రంగా ‘పౌరుషం’ చిత్రాన్ని రూపొందించామని చిత్ర దర్శకుడు, హీరో షెరాజ్ మెహ్ద వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ ఆదివారం స్థానిక రంభ, ఊర్వశి, మేనక కాంప్లెక్స్కు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, హీరో షెరాజ్ మెహ్ద మాట్లాడుతూ, యువిటీ హాలివుడ్ స్టూడియోస్(యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్పై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను సుమ తల్వార్, మేకా రామకృష్ణ, అశోక్ ఖుల్లార్, జ్యోతిరెడ్డి, ఆమని, శైలజ తివారి, అనంత్, కనిక, జబర్దస్త్ కార్తిక్, కట్టప్ప, గంగాధర్ పోషించారని తెలిపారు. కుటుంబ విలువలు, అన్నాచెల్లెళ్ల అనురాగం, ప్రేమ పేరుతో యువతులు మోసంపోవడం వంటి అంశాలను ఈ చిత్రంలో చూపించామన్నారు. రాజమండ్రికి చెందిన సినీ హీరో గంగాధర్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రానికి తానే సంగీతాన్ని సమకూర్చినట్టు తెలిపారు. నిర్మాత అశోక్ ఖుల్లార్ మాట్లాడుతూ, ఈ చిత్రం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నారు. నటుడు గంగాధర్ మాట్లాడుతూ, చిత్రంలో తాను సుమ కుమారుడిగా, హీరోయిన్కు సోదరుడిగా నటించానన్నారు. తనకు మంచి పాత్ర ఇచ్చిన షెరాజ్ మెహ్దకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా చిత్ర యూనిట్కు థియేటర్ వద్ద ఘన స్వాగతం లభించింది.