తలుపులమ్మ సన్నిధిలో రద్దీ | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ సన్నిధిలో రద్దీ

Oct 13 2025 8:28 AM | Updated on Oct 13 2025 8:28 AM

తలుపులమ్మ సన్నిధిలో రద్దీ

తలుపులమ్మ సన్నిధిలో రద్దీ

తుని రూరల్‌: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 10 వేల మంది భక్తులు అమ్మవారి సన్నిధికి తరలి వచ్చారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం సమకూరిందని వివరించారు. వసతి గదులు లభించని భక్తులు ఆలయ ప్రాంగణంలో చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేటు కాటేజీల్లోను వంటలు, భోజనాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement