
అన్నవరం దేవస్థానానికి రూ.30 లక్షలతో బస్సు
అన్నవరం: సత్యదేవుని దేవస్థానానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.30 లక్షల విలువైన 32 సీట్లు కలిగిన బస్సును సమకూర్చింది. ఈ బస్సు తాళాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందజేశారు. గతంలో కూడా ఎస్బీఐ రెండు బ్యాటరీ కార్లు, ఒక బస్సును దేవస్థానానికి అందజేసింది. కార్యక్ర మంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం రాజేష్కుమార్ పటేల్, జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, డీజీఎం పంకజ్ కుమార్ (రాజమహేంద్రవరం), సర్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.