
బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్
అమలాపురం రూరల్: తెలుగు జాతికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కొనియాడారు. కలెక్టరేట్లో బుధవారం ఎన్టీఆర్ జయంతిని అధికారకంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారన్నారు. డీఆర్ఓ రాజకుమారి మాట్లాడుతూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాలలో ఎన్టీఆర్ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారన్నారు. కార్యక్రమంలో ఏవో కె.కాశీ విశ్వేశ్వరరావు, డీఈవో షేక్ సలీమ్ బాషా, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎంల
పదోన్నతులకు రంగం సిద్ధం
రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రేడ్–2, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ బదిలీ దరఖాస్తుల గడువు ముగిసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ బదిలీ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా సాగుతోంది. బదిలీలకు 230 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ క్యాడర్ల బదిలీ దరఖాస్తుల సంఖ్య లెక్క తేలాల్సి ఉంది. బుధవారం సాయంత్రానికి ఎంతమంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు దరఖాస్తు చేసుకున్నారన్న సంఖ్య స్పష్టం కాలేదు. పీఎస్ హెచ్ఎంలకు బదిలీల వెబ్ ఆప్షన్లు బుధవారం రాత్రికి ఓపెన్ అయ్యే అవకాశమున్నట్లుగా సమాచారం.
98 మందికి పదోన్నతి లభించే అవకాశం
స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 98 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి లభించే అవకాశముంది. 1:3 నిష్పత్తిలో పదోన్నతులకు ఉపాధ్యాయులను ఆహ్వా నిస్తున్నారు. ఈ మేరకు పదోన్నతుల సీనియారిటీ జాబితాలో ఉన్నవారు కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అనివార్య కారణాలతో కౌన్సెలింగ్ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పదోన్నతి సీనియారిటీ జాబితాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు విల్లింగ్/నాట్ విల్లింగ్ ఆప్షన్ తీసుకుంటారు. విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన అనంతరం బదిలీ దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా ఎంపిక చేసుకునే స్కూల్ కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్