మరీ ఇంత దారుణమా.. శత్రువు కుటుంబంతో మాట్లాడిందని..

Woman Thrashed For Talking To Rival Family In Gujarat - Sakshi

గాంధీనగర్‌ : శత్రువు కుటుంబసభ్యులతో మాట్లాడిందని ఓ మహిళను దారుణంగా కొట్టాడో భర్త. ఈ సంఘటన గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. దహెద్‌ జిల్లాకు చెందిన మకి మఖ్లా వాల్వాయ్‌ అనే మహిళ కుటుంబానికి, భదోర్‌ కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచి రెండు కుటుంబాలు మాట్లాడుకోవటం లేదు. అయితే, కొద్ది రోజుల క్రితం మకి.. భదోర్‌ కుటుంబానికి చెందిన వారితో మాట్లాడింది. సోమవారం ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో అతడు ఆమెను ఇంటి బయటకు లాక్కువచ్చి కొట్టాడు.

మరో ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. భదోర్‌ కుటుంబం ఆపటానికి ఎంత ప్రయత్నించినా వాళ్లు ఆగలేదు. రోడ్డుపై ఈడుస్తూ భదోర్‌ ఇంటి ముందుకు తెచ్చిపడేశాడు. ఈ దాడిలో మకికి గాయాలయ్యాయి. మకి కుమారుడు సురేష్‌ వాల్వాయ్‌ ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top