కృష్ణాలో ట్రాక్టర్‌ ట్రక్‌ బోల్తా: నలుగురి పరిస్థితి విషమం

Tractor Truck Rollover In Krishna District - Sakshi

సాక్షి,  కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విసన్నపేట మండలం ముతారాశి పాలెం చెందిన ఓ ట్రాక్టర్‌ ట్రక్‌ శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమ‍ంగా ఉండడంతో విజయవాడకు తలించారు. 14 మంది కూలీలకు గాయాలు కాగా, వారిని విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రమాద సమయంలో ఆ ట్రక్‌లో 18 మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా మామిడి కోతకు ట్రాక్టర్‌ ట్రక్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చదవండి: అమలాపురంలో మహిళ దారుణ హత్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top