గుంటూరు: పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు యువకుల మృతి

Bike Accident At mangalagiri Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పుట్టిన పుట్టినరోజు వేడుకలు ముగించుకొని కృష్ణాయపాలెం నుంచి పెనుమాక వస్తుండగా ఓ ద్విచక్ర వాహనం కరెంటు స్తంభానికి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సతీష్‌రెడ్డి, ఎస్‌కే రాజుతో పాటు మరో యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరణించిన ముగ్గురు యువకులు పెనుమాకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

చదవండి: హైగ్రో కెమికల్స్‌ రూ.1.93 కోట్ల ఎఫ్‌డీల జప్తు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top