హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే? | - | Sakshi
Sakshi News home page

హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?

Jul 13 2025 7:30 AM | Updated on Jul 13 2025 7:30 AM

హత్య

హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్‌ డ్రైవర్‌ దారుణ హత్య
● రాజకీయ వ్యూహాలు చేరవేస్తున్నాడని గత నెలలో డ్రైవర్‌గా తొలగింపు ● వ్యక్తిగత రహస్యాలు బట్టబయలవుతాయని కడతేర్చిన వైనం ● జనసేన నుంచి వినుతను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు

ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్‌తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చైన్నెలోని ఓ నదిలో పడవేసినట్టు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

సాధారణ యువతి నుంచి..

రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్‌ స్థానికంగా మెడికల్‌ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్‌ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమైపె పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు.

జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చైన్నెలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు.

జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్‌ వేసినట్లు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్‌ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చైన్నె పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చైన్నెకి తీసుకెళ్లి మింట్‌ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చైన్నె పోలీసులు వెల్లడించారు.

హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?1
1/1

హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement