
స్లో బైక్ రైడింగ్ పోటీలు
చిత్తూరు అర్బన్ : రహదారి భద్రతా నియమాలను పాటించడంలో భాగంగా త్వరలోనే చిత్తూరులో స్లో మోటారు సైకిల్ రైడింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు అన్నారు. ఆదివారం నగరంలోని ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో పోలీసులకు ఈ పోటీలపై అవగాహన కల్పించడానికి ట్రయల్ నిర్వహించారు. హెల్మెట్లు పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్న వారు ఎవ్వరైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వీలైనంత నిదానంగా వాహనం నడపగలగడమే ఈ పోటీ లక్ష్యమన్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నారని, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు 94910 74515 నంబరుకు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.