
కాళ్లరిగేలా తిరుగుతున్నాం
మాది అనంతపురం. 15ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నాం. భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి మా దగ్గర ఉన్న సొమ్ముతో ఇటీవలే పెళ్లి చేశాం. మూడో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో పది చదువుతోంది. రెండో అమ్మాయి మంచి మార్కులతో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. కానీ, పైచదువులకు పంపాలంటే భయమేస్తోంది. అయితే మాలాగా కష్టం చేయకూడదని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలో రూ.లక్షలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవదని చెబుతున్నారు. దీంతో అప్పు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. – శారద, భవన నిర్మాణ కూలీ, తిరుపతి
వడ్డీకి తెచ్చాం
పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థి తి ఏర్పడింది. మా అమ్మా యి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివింది. పదో తరగతి కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాం. ఏడాదికి హాస్టల్తో పాటు మొత్తం ఫీజు రూ.1.80వేలు కట్టాల్సి వచ్చింది. దాచుకున్న రూ.50వేలకుతోడు మరో రూ.1.30వేలను వడ్డీవ్యాపారుల వద్ద రూ.5లకు వడ్డీకి తెచ్చి కట్టా. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయిని అందుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. నేను చిన్న ఉద్యోగిని. నా భార్య దివ్యాంగురాలు. మా కష్టం పిల్లలకు రాకూడదని అప్పు చేసి చదివిస్తున్నాం.
– రామకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి, గూడూరు