
కారు ఢీ – మహిళ మృతి
రొంపిచెర్ల: కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం, బోనంవారిపల్లె వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రాం, చింతమణి నరిసింగపేటకు చెందిన ఎన్వీ. సవిత (56), చందర్ (38) ద్విచక్ర వాహనంలో తిరుపతికి బయల్దేరారు. అక్కడ శనివారం రాత్రి జరగనున్న శుభాకార్యంలో పాటల కచ్చేరి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో తిరుపతి వైపు నుంచి కారు పీలేరు వైపు వెళ్తూ బోనంవారిపల్లె వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సవిత(56) అక్కడికక్కడే మృతి చెందగా.. చందర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీ – మహిళ మృతి

కారు ఢీ – మహిళ మృతి