
సూర్య, చంద్రప్రభలపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సంతాన వేణుగోపాలుడు పశుపాలకుడైన శ్రీకృష్ణునిగా .. జీవకోటికి వెలుగును ప్రసాదించే దినకరుడిపై విహరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణాభరాలు, పట్టుపీతాంబరాలతో శ్రీకృష్ణునిగా భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగారు. కార్యక్రమంలో ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షారాబ్ బాబుసురేష్ ,కంకణభట్టర్ తరుణ్కుమార్, వేద పండితులు పాల్గొన్నారు.