
అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన
కలెక్టరేట్లో సమర్పిస్తున్న వినతులకు అతీగతీ లేకుండా పోయిందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025
చిత్తూరు అర్బన్: జిల్లాలో గత ఏడాది అక్టోబర్లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించి, ప్రైవేటు షాపులకు పగ్గాలు అప్పగించింది. కేవలం కూటమి పార్టీ నేతలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రైవేటు మద్యం దుకాణాలకు తొలుత 20 శాతం లాభాలు వస్తాయని పాలసీ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆపై దుకాణాలు దక్కించుకున్న తమవారికి లాభం చేకూర్చేలా ప్రణాళిక రచించింది. ల్యాండింగ్కాస్ట్లో 20 శాతం లాభాలు చూపించినా, తమకు వాస్తవానికి అంత మొత్తం రావడంలేదని వ్యాపారులు చెప్పడంతో.. హుటాహుటిన ఇతర పన్నులు తగ్గించి, మరో 4 శాతం దుకాణదారుల జేబుల్లోకి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అదునుగా జిల్లాలోని కూటమి నేతలు రంగంలోకి దిగారు. ప్రతి మద్యం దుకాణంలో అమ్మకాలపై శ్రీపచ్చశ్రీ పన్ను చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు. తొలి దఫాలో నోటిఫికేషన్లో 104 దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులతో పాటు, ఈ ఏడాది కల్లుగీత సామాజిక వర్గాలకు ఇచ్చిన పది షాపుల నుంచి కూడా మామూళ్లు వసూలు చేయడం మొదలుపెట్టారు.
ప్రతి నెలా రూ.అర కోటి వరకు
జిల్లాలోని 114 ప్రైవేటు మద్యం దుకాణాలు, 8 బార్ల నుంచి కూటమి నేతలు నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్నారు. అది కూడా వాళ్ల చేతికి ఏమాత్రం మట్టి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.30 వేలు చొప్పున, బార్ నుంచి నెలకు రూ.20 వేలు చొప్పున.. మొత్తంగా నెలకు రూ.అరకోటి వరకు పచ్చ పన్ను వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రతి నియోజకవర్గంలోని కూటమికి చెందిన ప్రధాన నాయకుడికి 70 శాతం, మద్యం దుకాణం పరిధిలోని పోలీస్ స్టేషన్కు 10 శాతం, 20 శాతం ఎకై ్సజ్ అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తం వసూలు ప్రక్రియ కోసం ఆబ్కారీశాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్ ఏజెంట్లు నియమించుకున్నారనే విమర్శలున్నాయి. మళ్లీ ఇందులో ఆబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారికి ఒక్కో దుకాణానికి నెలకు రూ.4 వేలు, మరో అధికారికి రూ.2 వేలు వాటా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ శాఖ సిబ్బందే చూసుకోవాలి. అయితే స్టేషన్ నిర్వహణ, సారా నిర్మూలన పేరిట తనిఖీలకు వెళ్లేప్పుడు వాహనాలకు డీజిల్ నింపుకోవడానికి కూడా ఏమీ మిగలడంలేదని కొందరు అధికారులు నిట్టూరుస్తుండడం గమనార్హం.
– 8లో
– 8లో
న్యూస్రీల్
మద్యం అమ్మకాలపై ‘పచ్చ’ పన్ను
ఒక్కో వైన్షాపు నుంచి రూ.30 వేలు వసూలు
కలెక్షన్ ఏజెంట్లుగా ఎకై ్సజ్ అధికారులు
ఇష్టారాజ్యంగా దుకాణదారులకు అనుమతులు
అధిక ధరలతోపాటు రాత్రింబవళ్లు విక్రయాలకు గ్రీన్సిగ్నల్
జిల్లాలోని వైన్షాపుల యజమానులతో కూటమి నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా అనధికారికంగా ‘పచ్చ’ పన్ను విధించారు. రాత్రింబవళ్లు మద్యం విక్రయాలు సాగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముకునేందుకు ‘పచ్చ’ జెండా ఊపేశారు. ఇందుకోసం ఒక్కో దుకాణం నుంచి ప్రతి నెలా రూ.30వేలు చెల్లించాలని నిబంధన అమలు చేస్తున్నారు. ముడుపుల వసూలు బాధ్యతను ఘనత వహించిన ఎకై ్సజ్ అధికారులకే అప్పగించారు. ప్రతిష్టాత్మక ఖాకీలను కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారు.
ఇక అంతా మీ ఇష్టం
దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేస్తు న్న అధికారులు.. దానికి ప్రతిఫలంగా వ్యా పారులకు కొన్ని వెలుసుబాట్లు కూడా కల్పించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచాల్సిన మద్యం షాపులను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుకునే అవకాశమిస్తున్నారు. ఇక ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లను తెల్లవారుజాము 5 గంటలకే తెరచి, అర్ధరాత్రి వరకు విక్రయాలు చేసుకునేందుకు అనధికారిక అనుమతులు ఇచ్చేశారు. అనధికార పర్మిట్ గదులు వందల సంఖ్యలో ఉన్నా అధికారులు పట్టించుకోకుండా, ఇక అంతా మీ ఇష్టం అంటూ వ్యా పారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు తెరచి ఉంచిన వైనాన్ని ‘సాక్షి’పత్రిక ఎండగట్టడంతో.. మేల్కొన్న అధికారులు, ముందస్తు సమాచారం ఇచ్చి మరీ సమయపాలన తనిఖీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనితోడు చాలా దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్చగా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా వైన్షాపుల వారు క్వార్టర్ బాటిల్పై రూ. 10 నుంచి రూ. 20 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపు పేరిట బాటిల్ మద్యంపై రూ. 30 నుంచి రూ. 50 వరకు, అర్ధరాత్రి దాటక రూ.50 నంచి రూ.100వరకు ఎక్కువ రేటుకు విక్రయాలు సాగిస్తున్నారు.

అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన

అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన

అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన